మహా కవి కాళిదాసు అభిఙ్ఞాన
శాకున్తలమ్ నాటకంలో జీవితం సుఖ దు:ఖాల సమ్మేళనం అని చెప్పిన ఒక గొప్ప శ్లోకాన్ని
యూడండి...
యాత్యేకతో2స్త శిఖరం పతిరోషధీనా
మావిష్కృ తో2రుణ పురస్సర ఏకతో2ర్క:
తేజో
ద్వయస్య యుగపద్వ్యసనోదయాభ్యామ్
లోకో నియమ్యత ఇవాత్మదశాన్తరేషు.
చతుర్ధాంకంలో కణ్వ శిష్యుడు ప్రభాత కాలాన్ని వర్ణిస్తూ చెప్పిన
శ్లోకమిది.
ఒక వేపు చంద్రుడు
అస్తగిరికి పోతున్నాడు. ఒక వేపు దినకరుడు అనూరుడు రధసారధిగా రధం నడుపుతూ ఉండగా
ఉదయిస్తున్నాడు.
ఆహా! రెండు దివ్య తేజస్సులు
ఒకే సమయంలో వ్యసనోదయములు పొందుతున్నవి కదా.
ఒక తేజస్సు అంతర్హితమవుతూ
ఉంటే, ఒక
తేజస్సు ప్రవర్ధమానవవుతున్నది.
ఏక కాలంలో కనిపిస్తున్న ఈ
సూర్య చంద్రుల ఉదయాస్తమయాలు లోకంలో ప్రాణులకి సంభవించే సుఖదు:ఖాలని గుర్తునకు
తెచ్చేదిలాగ ఉన్నది కదా !
ఇదీ ఈ శ్లోక భావం.