చెప్తే వినాలి
సంతస్తాయసి సంస్థితస్య
పయసో నామాసి నశౄయతే
ముక్తాకారతయా తదేవ నలినీ
పత్ర సితం దృశ్యతే
అంతస్సాగర శుక్తి మధ్య
పతితం తన్మౌక్తికం జాయతే
ప్రాయేణాధం మధ్యమోత్తమ
జుషా మేవం విధా వృత్తయ :
నీరము తప్త లోహమున నిల్చి
యనామకత్వ మై నశించు,నా
నీరమె ముత్యమట్లు నళినీ
దళ సంస్థితమై తనర్చు ,
నా
నీరమె శుక్తిలోఁబడి
మణిత్వము గాంచు సమంచిత ప్రభు
బౌరుష వృ త్తులిట్లధమ
మధ్యమునుత్తముఁగొల్చు వారికిన్
బాగా కాలిన లోహం
మీద పడి నీరు వెంటనే అనామకంగా ఆవిరయి పోతుంది. ఆ నీటి బిందువే తామరాకుమీద ముత్యంలా
మెరుస్తుంది. అదే నీరు శుక్తిలో పడితే... మణిగా భాసిస్తుంది.
అలాగే, మనం
అధములను సేవిస్తే నాశనమై పోతాం. మధ్యములని సేవిస్తే ఒకింత రాణిస్తాం. ఉత్తములని
సేవించుకుంటే గొప్ప కీర్తిమంతులమౌతాము.
దుర్జనులు ఎప్పుడూ
పరిహరించదగిన వారే. పడగ మీద మణి ఉంది కదా అని, నాగుపాముని
ఆదరించం కదా ?