పలుకే బంగారం 02
బద్దె భూపాలుడు సుమతీ శతకంలో ఇతరుల మనసు
బాధించకుండా మాటలాడ దగునని చెప్పాడు
.
ఎప్పటి కెయ్యది ప్రస్తుత,
మప్పటికా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపకఁదానొవ్వక
తప్పించుక తిరుగు వాడు ధన్యుడు సుమతీ !
ఎప్పుడేది మాట్లాడాలో అప్పుడది మాట్లాడాలి.
ఇతరులు మనసులు బాధించ కూడదు. అలా లౌక్యంగా వ్యవహరించే వాడు ధన్యుడయ్యా అంటాడు కవి.
అలా అని ఇతరుల మెప్పు కోసం వారికి నచ్చుతుందని
చెప్పి నానా చెత్తా పలకమని కాదు ...
పరుషంగా కాక,
కాస్త
సౌమ్యంగా మాట్లాడమని కవి బోధిస్తున్నాడు...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి