పలుకే బంగారం 01
సమ్యగ్భాషణం వ్యక్తికి భూషణం. మంచిగా మాట్లాడితే
అందరూ మిత్రులే. కఠినోక్తుల వల్ల మనకి అంతా శత్రువులవడం తథ్యం.
ఈ చిన్న కంద పద్యంలో కవి ఆ విషయాన్ని ఎంత చక్కగా
వివరించాడో చూడండి ...
కాకేమి తన్నుఁదిట్టెనె ?
కోకిల ధనమేమి తన్నుఁగో కొమ్మనెనే !
లోకము పగయగు బరుసని
వాకున ,జుట్టమగు మధుర వాక్యము
కలిమిన్ !
పాపం, కాకి నిన్నేమీ తిట్ట లేదు
కదా ? అదంటే అసహ్యించుకుంటావేం ? ఊరికే కాకి గోల ! అంటూ విసుక్కుంటావు. మరి, కాకిలాగా నల్లగానే ఉంటుంది కదా,
కోకిల
- అది నీకేమీ పెట్టుపోతలు జరిపించడం లేదు కదా ?
దాని
గొంతువిని మెచ్చుకుంటావు ?
మధురంగా పలకడం చేతనే కదా కోకిలని యిష్ట
పడుతున్నావు ?
అందు చేత, మంచిగా మాట్లాడడం వల్ల
అందరి ప్రేమనూ పొందవచ్చును. రుస రుసలాడుతూ ఉంటే ఎవరూ హర్షించరు. సరి కదా, చీదరించుకుని, దూరంగా జరిగి పోతారు ....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి