Day 03 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Day 03 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, మార్చి 2016, శనివారం

మా 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాలు ... Dayn 03 (29 -02-2016)

మా 8 రోజుల తమిళ నాడు  యాత్రా విశేషాలు  Day 03 ( 29-2-2016)
ఉదయం బ్రేక్ ఫాస్ట్  తంజావూరు టూరిజం వారి హొటల్ లోనే చేసి,మా మూడవ రోజు యాత్ర కోస8.30 ని. బయలు దేరాము.
కి బయలు దేరాం. మా ప్రయాణం రామేశ్వరానికి.   కానీ, దారిలో మా పేకేజీలో లేని మరో రెండు
దేవాలయాలను గైడ్ చూపించాడు. వాటి వివరాలు చెప్పేక, రామేశ్వరం గురించి చెబుతాను.
బస్ హైవేలో చాలా దూరం ప్రయాణం చేసాక, 9.30 ప్రాంతంలో వొక చోట సైడు రోడ్డు పట్టింది.
ఈ రోడ్డు ప్రయాణానికి మరీ అంత సుఖంగా లేదు. దాదాపు గంట  తర్వాత పెరుమియమ్ అనే
చోటుకి చేరుకున్నాం.  ఇక్కడ శయన భంగిమలో ఉన్న మహా విష్ణువు ఆలయం ఉంది.
 మహా విష్ణువు శ్రీదేవి, భూ దేవీ సహితుడై ఉంటాడు. నాభి నుండి పద్మం, దాని మీద బ్రహ్మ ఉంటాడు.  ఇదొక గుహాలయం.  పెద్ద కొండ గుహలో ఉంది. చూడ తగిన ఆలయమే. భక్తుల రద్దీ సామాన్యంగా ఉంది. పర్వ దినాలలో భక్తులు పోటెత్తుతారేమో  అనుకుంటాను.
 తొండమాన్ చక్రవర్తి దీనిని నిర్మించాడని  చెప్పారు. తిరుమల నిర్మాణాలలో ఈ ప్రభువు ప్రమేయం
చాలా ఉంది. శ్రీ వారి ఆలయంలో వీరి కంచు విగ్రహం ఉంది . శ్రీ మహా విష్ణువును దర్శించు కున్నాక
కోవెల బయట సమీపంలో లోనే వొక చిన్న గుహ చూపించాడు. వీరపాండ్య కట్టబ్రహ్మన్ ఇక్కడే
 తలదాచు కుని ఆంగ్లేయుల చేతికి చిక్కాడని చెబుతారు.  గుహ చాలా ఇరుకుగా ఉండి చొర రానిదిగా
 ఉంది.
 దీని తర్వాత బయలు దేరి సుమారు 11.30 గంటల ప్రాంతంలో చటివాడ అనే చోట  వొక పెద్ద గణపతి
 ఆలయం  చూసేము. ఈ గణపతి కరగాసురుడు అనే రాక్షసుని సంహరించాడని స్థల పురాణం చెబు
తోంది. ఇక్కడి రాతి విగ్రహం చాలా పెద్దది. ఇది కూడా చూడ తగినదే.
2 గంటల ప్రాంతంలో  రామేశ్వరం వరకూ సముద్ర తీరాన వేసిన రైల్వే ట్రాక్,సముద్రంలో షిప్ లు
 వస్తే దారి ఇస్తూ రెండుగా చీలి పోయే అద్భుత మయిన రైలు వంతెనా ఉన్నాయి.
( హౌరా బ్రిడ్జి కూడా ఇలాంటిదే) దీని పొడవు దాదాపురెండున్నర కి.మీ ఉంటుందిట.ఇది కాక
ఎడమ వేపు ఇందిరా గాంధీ హయాంలో నిర్మించిన  రోడ్డు వంతెన కూడా ఉంది.
ఇక్కడ సముద్రం నీల వర్ణ శోభితమై కనుల పండువుగా ఉంటుంది. ట్రాఫిక్ కి అడ్డు లేకుండా మా బస్
 వో ప్రక్కగా ఆపి దిగి చూసి వేగిరం రండని గైడ్ చెప్పడంతో అందరం పొలోమని కెమేరాలతో
బస్ దిగేం. ఆ వంతెనలు. సముద్రం ఆ దృశ్యాలు ఎంత చూసినా తనివి తీరేలా లేదు. కాసేపు
ఫొటోలు తీసు కున్నాక, బస్ ఎక్కాము. బస్ బయలు దేరింది. రామేశ్వరానికి చేరు కోడానికి
ముందు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి సమాధి బస్ లోనుండే చూపించాడు.  మరి కొంత
దూరం వెళ్ళాక శ్రీరాముడు ప్రతిష్ఠించాడని చెప్ప బడుతున్ననలుచదరంగా ఉండే
నవగ్రహ మండపం ఉంది. సముద్రపు అలలు కప్పి వేయడంతో ఐదు గ్రహాలు మాత్రమే బయటకి
కనబడుతూ తక్కిన నాలుగూ నీటిలో కనబడుతూ న్నాయి. మూడు ప్రక్కలా అనంత మయిన
సముద్ర జలాలను చూస్తూ, రాతి పలకల చప్టా మీద ఆ నవగ్రహాలనూ దర్శిచు కోవడం
వొక మధురానుభూతి అనే చెప్పాలి.
రాముడు ప్రతిష్ఠించిన నవగ్రహాలనూ దర్శిచు కున్నాక బస్ ఎక్కాము. రామ నాథంలో లంచ్ .
ప్రైవేటు హొటల్. చాలా పెద్దదే. గైడ్ సూచనతో  ఉదయం టిఫిన్ లు కాస్త హెవీగా ఉడడంతో ఆకళ్ళు
 లేక మేమూ మురళీ కృష్ణ గారూ పూర్తి భోజనం కాకుండా పెరుగన్నాలు మాత్రం తెప్పించుకు తిన్నాం. పెరుగన్నం
పెరుగన్నం కమ్మగా ఉంది. వారి కుటుంబ సభ్యులు రాధ గారూ విజయ లక్ష్మి గారూ  ఆకలి లేక
పోవడంతో పెరుగన్నం కూడా తీసుకో లేదు.అరటి పళ్ళు తినిఊరుకున్నారు.
      లంచ్ అయ్యాక, బస్ ఎక్కాం. బస్  సాయంత్రం నాలుగు గంటలకి రామేశ్వరం చేరుకుంది.
       టూరిజమ్ వారి హొటల్ చేరుకుని గదులలో ప్రవేశించాము. ఆలస్యం చెయ్యకుండా
        రామేశ్వరలో స్నానాలకు కావలసిన బట్టలు పోలథిన్ కవర్లలో పెట్టుకుని బయలు దేరేం.
        స్నానాలకీ, గుడి లోకీ వెళ్ళ వలసి ఉంటుంది కనుక సెల్ ఫోన్ లూ, కెమేరాలూ హొటల్
         గదిలోనే ఉంచేసాము.
        అక్కడ సముద్ర స్నానం చేసాక కోవెలలో ఉన్న 21 బావులలో స్నానం చేయాలంటారు.
        ఆ తర్వాత పొడి బట్టలు కట్టుకుని రామనాథ స్వామి దర్శనం చేసు కోవాలి. డబ్బులు తీసుకుని
        బావులలో నీరు తోడి పోయడానికి  కొందరు వ్యక్తులు ఉంటారు. మా గైడ్ మాకూ, మురళీ కృష్ణ
గారి కుటుంబానికీ వొక తెలుగు వచ్చిన వ్యక్తిని కుదిర్చి పెట్టాడు. అతడు మనిషికి వంద రూసాయల
చొప్పున  వసూలు చేసాడు. సముద్ర స్నానాలు చేయడానికి వీలుగా ఘాట్ లు ఉన్నాయి.
 ముందుగా  మేము సముద్ర స్నానాలు చేసి, ఆ తడి బట్టలతోనే కోవెల లోనికి వెళ్ళి 21 బావులలో
ఆ వ్యక్తి నీరు తోడి పోస్తూ ఉంటే స్నానాలు చేసాము.ఇక్కడ నీళ్ళు తోడి పోసే వాళ్ళు మనల్ని బావి నుండి
 బావికి పరుగులు పెట్టిస్తూ ఉంటారు. లోగడ ఒక్కో నూతికీ నీళ్ళు తోడి పోయడానికి పావలా చొప్పున యిచ్చి
స్నానాలు చేసామని రాధ గారు చెప్పేరు.
నూతులలో స్నానాలు అయ్యేక పొడి బట్టలు మార్చుకుని ( బట్టలు మార్చు కోడానికి అక్కడ సదుపాయం
ఉంది)  రామనాథ స్వామి దర్శనం చేసు కున్నాము. కాశీ నుండి  మేము తెచ్చిన గంగను
అక్కడి పూజారులకి ఇస్తే సైకత లింగానికి అభిషేకం చేసారు.
ఈ బావుల వివరాలు:
1.మహా లక్ష్మీ తీర్ధం  2. సావిత్రీ తీర్ధం  3. గాయత్రీ తీర్ధం  4.సరస్వతీ తీర్ధం   5.సేతు మాధవ తీర్ధం    6. గంధమాదన తీర్ధం   7.కవచ తీర్ధం   8.గవయ తీర్ధం  9. నత తీర్ధం  10. నీల తీర్ధం  11. శంఖర తీర్ధం  12.చక్ర తీర్ధం  13.బ్రహ్మ హత్యా పాతక విమోచన తీర్ధం  14. సూర్య తీర్ధం   15. చంద్ర తీర్ధం   16. గంగా తీర్ధం   17. యమునా తీర్ధం   18. గయా తీర్ధం   19.  శివ తీర్ధం   20 సత్యామృత తీర్ధం  21 సర్వ తీర్ధం 22 కోటి తీర్ధము.


ఇక్కడ రామేశ్వరం గురించిన కొన్ని వివరాలు చెబుతాను ...
రామేశ్వర ఒక ద్వీపం.ఈ ద్వీపాన్ని ప్రధాన భూభాగం నుడి పంబన్ కాలువ వేరు చేస్తోంది.
ఈ ద్వీపం శంఖు ఆకారంలో ఉంటుందంటారు. సుముద్రం అవతలి తీరాన శ్రీలంక
 రాజధాని కొలంబో ఉంది. ఇక్కడి స్వామి రామనాథ స్వామి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇదొకటి. ఇది
సైకత(ఇసుక) లింగం. రావణ సంహారానంతరం బ్రహ్మ హత్యా పాతకం నుడి తప్పించు కోడానికి శ్రీరాముడు
లింగ ప్రతిష్ఠ చేయ దలచాడు. హనుమంతుడిని కైలాసం వెళ్ళి ప్రతిష్ఠ కోసం శివ లింగాన్ని తెమ్మని
పంపించేడుట. కానీ  సమయానికి హనుమ లింగం తీసుకుని  రాక పోవడంతో  ముహూర్తం మించి పోకుండా
 శ్రీరాముడు సీతమ్మ వారు చేసిన సైకత లింగాన్ని ప్రతిష్ఠించాడుట. తరువాత  కైలాసం నుండిలింగంతో
వచ్చిన హనుమంతుడు అలిగాడుట. అప్పుడు రాముడు ఆ లింగాన్ని కూడా ప్రక్కనే ప్రతిస్ఠించి,
దానికే ముందు పూజలు జరుగుతాయని మాట యిచ్చాడుట.
రామేశ్వరంలో ప్రభాత సమయాన వెళ్ళి స్ఫటిక లింగాన్ని కూడా దర్శించు కోవచ్చును. మాకు అవకాశం
లేక పోయింది. ఇక్కడ వానర సేన సాయంతో   శ్రీరాముడు సముద్రానికి వారధి నిర్మిచాడుట,.
 నీళ్ళపై తేలే రాళ్ళతో దీనిని నిర్మించాడంటారు. ఇలాంటి రాళ్ళని రామేశ్వరంనుండి తిరుగు ప్రయాణంలో
 వొక చిన్న గుడిలో చూసేము. ఈ రామ సేతువు రామేశ్వరంలో ధనుష్కోటి నుండి శ్రీ లంక వరకూ
వ్యాపించి ఉండేదిట.సముద్ర గర్భాన నాసా వారు ఇటీవల దీని ఉనికిని నిర్ధారించేరు.

రాత్రి 8 గటల ప్రాంతంలో హొటల్ కి చేరుకుని డిన్నర్ అయ్యేక విశ్రమించేం.
మర్నాడు 7.30కి కన్యాకుమారికి  మా ప్రయాణం. అందు వల్ల వేకువనే లేచి తయారైపోయి, నేనూ,
మా ఆవిడా మరో సారి సముద్రపు ఘాట్ వద్దకు వెళ్ళాం. మా ఆవిడ అక్కడి ఇసుకను
కొంత సేకరించింది. దీనిని తీసుకుని వెళ్ళి కాశీలో గంగలో కలపాలిట. ( ఈ సారి కాశీలో 9 రాత్రులు
నిద్ర చేయాలని మా సంకల్పం. ఆ కాశీ నాథుని దయ. )
మా తమిళ నాడు యాత్రలలో భాగంగా 4 వ రోజు కన్యా కుమారి యాత్ర గురించిన
వివరాలు ఇప్పటికి సశేషమ్.