27, జనవరి 2020, సోమవారం

ఇచ్చుటలో ఉన్న హాయీ..


                                      


ఇచ్చుటలో ఉన్న హాయీ..
ప్రియ:ప్రజానాం దాతైవ న పునర్ద్రవిణేశ్వర:
అగచ్ఛన్ కాంక్ష్యతే లోకై ర్వారిదో నతు వారిధి :
మబ్బు ఎప్పుడూ నీటినే యిస్తుంది. సముద్రం నీటిని పుచ్చుకుంటుంది. దానికి యివ్వడం తెలియదు !
ఎంత మంచి శ్లోకమో చూసారు కదూ ?
ఇవ్వడంలోని గొప్పతనం అలాంటిది మరి...
ఇవ్వడంలోని ఔన్నత్యాన్ని చాటి చెప్పే మంచి పద్యం ఒకటి పోతన గారి భాగవతంలో ఉంది. చూడండి ...
ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువు పై నంసోత్తరీయంబుపైఁ
బాదాబ్జంబులపై కపోల తటిపైఁబాలిండ్లపై నూత్న మ
ర్యాదం జెందు కరంబు గ్రిందగుట మీదై నా కరంబుంట మే
ల్గాదే ? రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే !
వామన చరితంలోని ఈ పద్యం బలి చక్రవర్తి శుక్రాచార్యునితో పలికినది. . తెలుగు సాహిత్య చరిత్రలో మకుటాయమానమైన
పద్య రత్నాలలో యిదొకటి !


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి