ఇచ్చుటలో ఉన్న హాయీ..
ప్రియ:ప్రజానాం దాతైవ న
పునర్ద్రవిణేశ్వర:
అగచ్ఛన్ కాంక్ష్యతే లోకై
ర్వారిదో నతు వారిధి :
మబ్బు ఎప్పుడూ నీటినే
యిస్తుంది. సముద్రం నీటిని పుచ్చుకుంటుంది. దానికి యివ్వడం తెలియదు !
ఎంత మంచి శ్లోకమో
చూసారు కదూ ?
ఇవ్వడంలోని గొప్పతనం
అలాంటిది మరి...
ఇవ్వడంలోని
ఔన్నత్యాన్ని చాటి చెప్పే మంచి పద్యం ఒకటి పోతన గారి భాగవతంలో ఉంది. చూడండి ...
ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువు పై నంసోత్తరీయంబుపైఁ
బాదాబ్జంబులపై కపోల
తటిపైఁబాలిండ్లపై నూత్న మ
ర్యాదం జెందు కరంబు
గ్రిందగుట మీదై నా కరంబుంట మే
ల్గాదే ? రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే !
వామన చరితంలోని ఈ పద్యం
బలి చక్రవర్తి శుక్రాచార్యునితో పలికినది. . తెలుగు సాహిత్య చరిత్రలో మకుటాయమానమైన
పద్య రత్నాలలో యిదొకటి !
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి