14, మార్చి 2013, గురువారం

కొత్త కథల పుస్తకం - వేద ప్రభాస్ కథలు





మిత్రుడు వేద ప్రభాస్ ( జె.వి.బి. నాగేశ్వర రావు)  కొత్త కథల సంపుటిని వెలువరించాడు. సాహిత్యం లో కథానికకు ప్రపంచం లోనే  ఆద్యుడైన ఎడ్గార్ ఎలెన్ పో కథను  అత్యంత వేగంగా అన్ని దేశాలకూ అన్ని భాషలకూ పంప గలిగాడంటే కథా ప్రక్రియ ఎంత లలిత మైనదో,  తెలిసి పోతుంది. ఒక మంచి కథ చదివి నప్పుడు కథ ఎంత బలమైనదో కూడా అంతే  తేలిగ్గా తెలిసి పోతుంది. అంటూ తన మాటగా చెప్పుకొన్న వేద ప్రభాస్ విద్యా రంగంలో ఉపాధ్యాయునిగా మొదలిడి అనేక పదవులు నిర్వహించి, రాజీవ్ విద్యా మిషన్ లో విజయ నగరం .జిల్లా కమ్యూనిటీ మొబలైజేషన్ అధికారిగా ఇటీవలనే పదవీ విరమణ చేసారు.
అచ్చంగా ఇంత వరకూ 18 కథలూ పయనం, దేవభూమి, కొయ్య గుర్రాలు అనే నవలలు రాసారు.  రెండు నవలలు తెలుగు లోకి అనువాదం చేసారు.  రెండు కథలకు ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు కూడా అందు న్నారు, ఈ పుస్తకాన్ని తమ తల్లి దండ్రులకు అంకితం చేసారు.
దీనికి ముందు మాటగా తన  అభిప్రాయాన్ని  మల్లాది తెలియ జేస్తే , ఆప్త వాక్యాన్ని పంతుల జోగారావు రాశారు. రచయిత మంజరి తన మాటగా కథా గానం వినిపించారు,


12 కథలున్న ఈ పుస్తకం వెల వంద రూపాయలు. రచయిత పేర, ప్లాట్ నంబరు 71, నటరాజ్ కాలనీ విజయ నగరం చిరునామాకు సంప్రదించ వచ్చును. లేదా 08922220996 నంబరుకి కానీ, 9490791568 సెల్ నంబరుకి కానీ ఫోన్ చేస్తే చాలును. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి