కదిలేదీ కదిలించేదీ
విప్రకృత: పన్నగ: ఫణం
కురుతే
ప్రాయ: స్వం మహిమానం
క్షోభాత్ ప్రతిపద్యతే హి
జన:
దానితో రాజునకు ఆగ్రహం
కలిగి తిరిగి కర్తవ్యోన్ముఖుడవుతాడు....ఆ సందర్భంలో కవి చెప్పిన శ్లోకం యిది ....
ప్రతి మనిషిలోను
అంతర్గతమైన శక్తులు చాల ఉంటాయి. అయా ప్రత్యేక పరిస్థితులు కలిగినప్పుడు అవి వెలుగు
చూస్తాయి. వ్యథ లోనుండే కదా కథలు ఉద్భవిస్తాయి. వాల్మీకి విషయంలో ఏం జరిగిందో
తెలిసిందే కదా? శోకమే
శ్లోకమై ఒక మహా కావ్య ప్రాదుర్భవానికి నాంది పలకలేదూ!
‘ కదిలేదీ కదలించేదీ
కావాలోయ్ నవ కవనానికి ...’ అని శ్రీ.శ్రీ
గారనడంలో కూడ అంతరార్ధం యిదే కదా?

చితుకులు కదల్చుటను చెలగి
మండు
చెడఁగు చేయుటచేఁబాము పడగ
విప్పు
మఱియు క్షోభంబు వలననె
మానవుడును
దనదు మహిమంబు చూపును
తథ్యముగను.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి