31, డిసెంబర్ 2009, గురువారం

అర్ధ నారీశ్వరమ్


క్వతిష్ట తస్తే పితరౌ మమేతి
అపర్ణ యోక్తే పరిహాస పూర్వం
క్వవా తమేవ శ్వశురౌ తవేతి?
తామీరయన్ సప్మిత మీశ్వరోవ్యాత్


పార్వతీ దేవి ‘‘ నాకు గల తల్లి దండ్రుల వంటి వారు నీకు లేరు కదా ’’ అని పరమేశ్వరుడిని మేలమాడిందిట!
దానికి కినుక వహించకుండా ఆ జగత్పతి నవ్వుతూ ‘‘ నాకున్న అత్త మామలు నీకు లేరు కదా !’’ అని ప్రత్యుత్తరమిచ్చాడుట !
దీనికి తెలుగు సేత కూడ మన ప్రాచీన సాహిత్యంలో లభిస్తున్నది. చూడండి ...

‘‘నాకున్న తల్లిదండ్రులు
మీకేరీ’’యని యపర్ణ మేలములాడన్
‘‘నాకున్న యత్త మామలు
నీకేరీ’’ యనుచు నగు త్రినేత్రుని గొలుతున్.


( శ్రీకృష్ణ కర్ణామృతమ్ )

ఎంత మృదుభాషణమో చూడండి ! ఆలు మగల మధ్య యింతటి సహన సౌశీల్యం, అనురాగం ఉంటే ఆ ఇల్లొక నందన వనమే కదూ !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి