30, నవంబర్ 2010, మంగళవారం

మధ్యలో నన్నెందుకు లాగుతావూ ?!


( నీ హిత వచనమ్ డాట్ కామ్ సిగ్గోసిరి. మధ్యలో నన్నెందుకు
లాగుతావూ ?! హన్నా !!)


ఒక శ్లోకం చూడండి:

అసంభావ్యం న వక్తవ్యం, ప్రత్యక్ష మపి దృశ్యతే
శాలి తరతి పానీయం, గీతం గాయతి వానర:

నువ్వు ప్రత్యక్షంగా చూసినదే అయినా, అది అసంభవమైన విషయం అయితే మట్టుకు దాని రించి ఎప్పుడూ ఎవరితోనూ చెప్ప వద్దు సుమీ !

ఎందుకంటే, ‘ నీటి మీద రాయి తేలింది. కోతి పాటలు పాడింది’ అని చెబుతే ఎవరయినా నవ్వుతారే కాని నీ మాటలు నమ్మరు సుమా ! అని, ఈ శ్లోక భావం.

అసత్యం వ్యాప్తి చెందేంత త్వరగా సత్యం వ్యాప్తి చెందదు మరి. అసత్యానికి వెయ్యి కాళ్ళు, వినడానికి లక్ష చెవులు. తిరిగి వ్యాపింప చేయడానికి కోటి నోళ్ళు ఉంటాయి.

పాపం సత్యానికి అంత సీను లేదు. అలాగని సత్యం పలక వద్దని కాదు సుమా.

సత్యం వద. సత్యమే పలకాలి. ధర్మం చర . ధర్మాన్ని ఆచరించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి