6, జనవరి 2012, శుక్రవారం

ఈ ఏడాది జగన్నాథ శర్మకు చా.సో. స్ఫూర్తి అవార్డు ...


జగన్నాథ శర్మకి ఈ ఏడాది చా.సో స్ఫూర్తి అవార్డు లభించింది. తెలుగు కథకి తూర్పు దిక్కు శ్రీ చా.సో అవార్డు వీరికి లభించడం కథకి గర్వ కారణం.

శ్రీ జగన్నాథ శర్మ బుల్లి తెరకు (జెమిని, ఈ టి,వీ) కథా, మాటల రచయితగా చిర పరిచితులు. కొన్ని సినిమాలకు కథా సహకారం అందించారు, ప్రసిద్ధ పత్రికలకు సహ సంపాదకత్వ బాధ్యత వహించి, ప్రస్తుతం నవ్య వార పత్రికకు సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్ర జ్యోతి వారి నవ్య వార పత్రికను పాఠకుల పత్రికగానూ, రచయితల పత్రికగానూ కూడా సమర్ధ వంతంగా తీర్చి దిద్దడంలో వీరి కృషి అనన్య సామాన్య మైనది. నవ్యలో విశేష పాఠకుల ఆదరణ పొందిన పాలపిట్ట ప్రపంచ జానపద కథల ధారా వాహికం, కథా సరిత్సాగరం వీరి ప్రతిభకు నిలువెత్తు సాక్ష్యాలు.
వీరి వచన మహా భారతం , జగన్నాథ రథ చక్రాల్ (మొదటి పేజీ సంపాదకీయ రచనలు) పాఠకులను విశేషంగా ఆకట్టు కొంటూ సాగుతున్నాయి.


అసంఖ్యాకంగా కథల పోటీలు పెడుతూ, కథా నీరాజనం శీర్షికను నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తూ తెలుగు కథకు జయ కేతన మెత్తు తున్నారు. తెలుగు నాట ఎక్కడ కథా గోష్ఠులు నిర్వహించినా, వాటి వివరాలు ఫొటోలతో పాటు చక్కని వార్తా కథనాలు నవ్యలో ప్రచురిస్తున్నారు.

ఈ ఏడాది చా.సో స్ఫూర్తి అవార్డు ఎ.ఎన్ జగన్నాథ శర్మకు ఇస్తున్నట్టుగా చా.సో గారి కుమార్తె ప్రముఖ రచయిత్రి, చా.సో స్ఫూర్తి పురస్కార ట్రస్టు వ్యవస్థాపకురాలు చాగంటి తులసి ఈ క్రింది ప్రకటన చేసారు :

ప్రముఖ కథారచయిత చాగంటి సోమయాజులు (చాసో) 18వ స్ఫూర్తి పురస్కారం 2012, జనవరి నెల 17వ తేదీన విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన ప్రముఖ కథా రచయిత అయ్యల సోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథశర్మకు వచ్చింది. . పేగు కాలిన వాసన కథలు, అగ్రహారం కథలు, మావూరి కథలు రచయితగా, అనువాదకుడిగా జగన్నాథశర్మ కథాభిమానులకు చిర పరిచితులు. ఆయన కథల్లో వాస్తవికత, మానవీయతల మేలుకలయిక కనిపిస్తుంది., వ్యవస్థలోని అవకతవకలకు అద్దం పట్టి , సామాన్య మానవుల పట్ల అపారమైన ప్రేమ ఉన్న రచయిత వీరు.. కథ అల్లి చెప్పే కౌశలంతో ఎదిగి ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నందున చాసో స్ఫూర్తి పురస్కారానికి జగన్నాథ శర్మను ఈ అవార్డు వరించింది. జనవరి 17న చాసో 97వ పుట్టినరోజు , ఆరోజు సాయంత్రం విజయ నగరం మహారాజ లేడీస్ రిక్రియేషన్ క్లబ్‌లో ఐఎఎస్ అధికారి కె.వి.రమణాచారి అధ్యక్షతన సాయంత్రం 6 గంటలకు జరిగే సభలో శ్రీ జగన్నాథ శర్మకి రూ. 10,000 ల నగదు పురస్కారంతో పాటు, ప్రశంసా పత్రం అంద.జేయడం జరుగుతుంది.

కార్యక్రమం వివరాలు ఇలా ఉన్నాయి ...



ఇంత వరకూ చా.సో అవార్డు అందుకొన్న రచయితలు :


ఇంత వరకూ పుస్తక రూపంలో వెలువడిన జగన్నాథ శర్మ రచనలు ...











2 కామెంట్‌లు:

పూర్వ ఫల్గుణి (poorva phalguni) చెప్పారు...

చాల సంతోషం మండి!!ఈవార్తను మాఅందరితో
పంచుకున్నందుకు

పూర్వ ఫల్గుణి (poorva phalguni) చెప్పారు...

చాల సంతోషం మండి!!ఈవార్తను మాఅందరితో
పంచుకున్నందుకు

కామెంట్‌ను పోస్ట్ చేయండి