16, జనవరి 2015, శుక్రవారం

చాసో కథల్లో వెంటాడే వాక్యాలు !





తెలుగు కథకి తూర్పు దిక్కు చాసో ( చాగంటి సోమయాజులు) శత జయంతి వేడుకల సందర్భంగా... వారి కథల నుండి వెంటాడే వాక్యాలు  ....
 ‘పిల్లల హృదయాలు నిష్కల్మషంగా ఉంటాయి.స్వభావ సిద్ధంగా సంగీతం సమ్మోహన పరుస్తుంది. చిన్న వయసు నుంచి కాస్తంత రాగ తాళ ఙ్ఞానం కలిగిస్తే జీవితంలో సంగీతం ప్రవేశించి ఆజన్మాంతం ఆనంద హేతువు అవుతుంది.’

 ‘ కాని  ( పెళ్ళి చూపులకు  )వచ్చిన పెద్దలు పాటకు సెబాస్ అన్నారు. తెలుగు పెద్దలకి శృతీ, అపశృతీ తెలియవని,  రాగ తాళ ఙ్ఞానం వాళ్ళకుండదని, వాళ్ళ జీవితాలలో సంగీతం లేనే లేదని, అమాయకపు పెళ్ళి కూతుళ్ళకి ఏమి తెలుసు !’

‘నిత్య జీవితంలో ఆనందానికి, ఆరోగ్యానికి సంగీతం అవసమే. తాను పాడ లేక పోయినా అర్ధం చేసుకోగలిగితే ఉత్తమ సంగీతం మంచిని చేస్తుంది.’

‘వాతావరణంలో సంగీతం ఉంటే వాసాలు కూడా పాడతాయి.’

‘సరస్వతీ కటాక్షం నాకంతే ఉంది.   (ఫిడేలు) తల్లి వెళ్ళి పోయింది. వెళ్ళి పోతూ తల్లి గుణాన్ని చూపించు కుంది. నాకు ప్రాణం పోసింది. వెళ్ళి పోతూ నాకో చీరా రవికెల గుడ్డా పెట్టింది.’

                                                                                                        (వాయులీనం)
‘నాదారులు చిన్న దొంగ తనం చేస్తేపెద్ద నేరాలవుతాయి. ఉన్న వాళ్ళుచేస్తే కమ్ముకు పోతాయి. ’(కుంకుడాకు)

‘పెళ్ళాం మంచం మీద కళ్థళు మూసుకుని పరిమళిస్తూ పడుకున్నాది .దాని గుండెల మీంచి కిందకి వేళ్ళాడుతూ పడి వుంది మూడు మూళ్ళ జడ. ఏ పురుఫషుణ్ణయినా ఉరిపొయ్యడానికది చాలు. ’
( లేడీకరుణాకరం)

‘ఆరుగురు పిల్లలను పరాయి దేవతలకు కన్న తుంతీ దేవి పతివ్రతే అన్నారు.భర్త అనుమతిస్తే తప్పు లేదన్నారు శాస్త్రఙ్ఞులు. కుంతి పతివ్రత అయితే శారదా పతివ్రతే ’        ( లేడీ కరుణాకరం)

‘పాండిత్యం ఎక్కువయితే బుద్ధికి పడిశం పడుతుంది. ఎందుకొచ్చిన పాండిత్యాలు ?కూటికొస్తాయా ? గుడ్డకొస్తాయా ?’    ( (పరబ్రహ్మము)

‘అన్నం పరభ్రహ్మ స్వరూపం. అందుకు అన్వేషణ తప్పదు ! పరబ్రభ్మాన్ని అన్వేషించడమే జీవిత లక్ష్యమని అన్ని మతాలూ అంగీకరిస్తాయి.’    (పరబ్రహ్మము)
‘పదండి భడవ్లారా ! నేనే దొంగ మార్కెట్టులో  ( బియ్యం) అమ్ముకుని మేడలు కడుతున్నాను. నాకు ఉరిశిక్షకు తక్కువ వెయ్యకండి. నా పొగ కుక్కుటేశ్వరుడికి ధూపం వెయ్యండి’.     ( కుక్కుటేశ్వరము)

‘ఆనాటి దుమ్మలగొండె అనుభవం జీవితంలో ఘనమైన భ్రాంతిమదలంకారం.’   (దుమ్మలగొండె)

‘కూకుంటే ఎలతాదా?బూమిని బద్దలు సేసుకు బతకమన్నాడురా నిన్నూ నన్నూ బెమ్మ దేవుడు.’

‘మా గనమైన ఆలోశన తట్టింది. దెబ్బతో బుద్ధి మారి పోయింది.ఎళ్ళండ్రా అంతా ఎళ్ళండి.కూర్మిగాణ్ణి నానే పట్నం అంపుతన్నాను.మరి జట్టీ నేదు.’      ( వెలం వెంకడు)

‘కళ్ళు లేనివాడికి కడియాల రవలూ. గాజుల మోతలే కాబోలు కామాన్ని కదుపుతాయి’     ( ఎంపు)

‘కూడెట్టింది కాదు.  డబ్బు  సెడ్డ పాపిస్టి. తల్లీ పిల్లల ఆశలు సంపుతాది. రేత్రి జీతమంతా  (కూతురి) సేతిలెట్టినాను. పట్టెడన్నం పెట్టింది.ఇంక దినం తుతాది.’     ( బొండు మల్లెలు)

‘లేమి ఎంతటి వాళ్ళలోనయినా మానవత్వాన్ని చంపి అమానుషత్వాన్ని పెంచుతుంది. వృద్ధులకి పెన్షనులైనా ప్రభుత్వం ఇస్తే బావుణ్ణు. జీవిత భీమా ఉన్నా బావుణ్ణు.’      (బొండు మల్లెలు)

‘రాకరాక చిన్నాజీ వొచ్చింది.కథా వొద్దు. కావ్యం వొద్దు. చిన్నాజీతో ఐదు నిమిషాలు షేక్స్పియర్ కామిడీలో రసవంతమయిన ఐదంకాలపాటి చెయ్యవూ ? ’       (చిన్నాజీ)

‘ప..ప్స..పారెయ్య లేదు ఎందుకు పారేస్తాను నాన్నా.’        (ఎందుకు పారేస్తాను నాన్నా)

ఉపసంహారం :


చాసో కథల్లో వెంటాడే వాక్యాలంటూ ఏ కొన్నింటినో ఎత్తి రాయడ మేఁవిటి, వెర్రి కాక పోతే !

చాసో కథలన్నీ వెంటాడి వేధించేవే కదా ...


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి