23, డిసెంబర్ 2019, సోమవారం

దేని వన ఏది శోభిస్తంది ?



                                                      

దేని వలన ఏది శోభిస్తుంది ?

ఐశ్వర్యస్య విభూషణం సుజనతా శౌర్యస్య వాక్సంయమ:
ఙ్ఞానస్యోపశమ: శ్రుతస్య వినయో విత్తస్య పాత్రే వ్యయ:
అక్రోధ స్తపస: క్షమా ప్రభవితు ర్ధర్మస్య నిర్వ్యాజతా
సర్వస్యాపి హి సర్వ కారణ మిదం శీలం పరం భూషణమ్ .

ఐశ్వర్యం వల్ల ఏది శోభిస్తుంది ?
మంచితనం. ( సంపదకు మంచి తనమే అలంకారం. )

పరాక్రమం దేని వలన శోభిస్తుంది ?
మాట మంచితనం ( ఎంత పరాక్రమం ఉన్నా, మాట కరుకుదనం వల్ల వ్యక్తి శోభించడు.)

ఙ్ఞానం దేని వలన శోభిస్తుంది?
 శాంతం వలన ( శాంతం లేని వివేకం వృథాయే కదా)

పాండిత్యానికి అలంకారం ఏది ?
 వినయం

ధనం ఉన్నందుకు ఏది చేయడం వల్ల శోభ కలుగుతుంది ?
 పాత్రత నెరిగిన దానం

తపస్సునకు ఏది అలంకారంగా భాసిస్తుంది ?
సహనం. కోపం లేక పోవడం (క్రోధిగా తపస్వికిఁజన్నే? అని భారతం చెబుతోంది.)

సమర్ధునకి శోభనిచ్చే ముఖ్య లక్షణం ఏది ?
క్షమా గుణం


ధర్మమునకు శోభని కలిగించేది ఏది ?
నిర్మోహత్వం ( దేనిమీద ఎక్కువ మమకారం లేక పోవడం)

సమత వలన ఏమి కలుగుతుంది ?
 తేజస్సు.

తక్కిన ఏ గుణాలు ఉండనీ, లేక పోనీ, మంచి నడవడిక మాత్రం సమస్త జనులకూ శోభని ఇస్తుంది.

ఈ విధంగా పెద్దలు శీల వర్తనకి పెద్ద పీట వేసారు.

ఆధారం :   ఆంధ్ర మహా భారతం. కవిత్రయ రచన.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి