దేని వలన ఏది శోభిస్తుంది ?
ఐశ్వర్యస్య విభూషణం సుజనతా
శౌర్యస్య వాక్సంయమ:
ఙ్ఞానస్యోపశమ: శ్రుతస్య
వినయో విత్తస్య పాత్రే వ్యయ:
అక్రోధ స్తపస: క్షమా
ప్రభవితు ర్ధర్మస్య నిర్వ్యాజతా
సర్వస్యాపి హి సర్వ కారణ
మిదం శీలం పరం భూషణమ్ .
ఐశ్వర్యం వల్ల ఏది
శోభిస్తుంది ?
మంచితనం. ( సంపదకు మంచి
తనమే అలంకారం. )
పరాక్రమం దేని వలన
శోభిస్తుంది ?
మాట మంచితనం ( ఎంత పరాక్రమం
ఉన్నా, మాట
కరుకుదనం వల్ల వ్యక్తి శోభించడు.)
ఙ్ఞానం దేని వలన
శోభిస్తుంది?
శాంతం
వలన ( శాంతం లేని వివేకం వృథాయే కదా)
పాండిత్యానికి అలంకారం ఏది ?
వినయం
ధనం ఉన్నందుకు ఏది చేయడం
వల్ల శోభ కలుగుతుంది ?
పాత్రత
నెరిగిన దానం
తపస్సునకు ఏది అలంకారంగా
భాసిస్తుంది ?
సహనం. కోపం లేక పోవడం
(క్రోధిగా తపస్వికిఁజన్నే? అని
భారతం చెబుతోంది.)
సమర్ధునకి శోభనిచ్చే ముఖ్య
లక్షణం ఏది ?
క్షమా గుణం
ధర్మమునకు శోభని కలిగించేది
ఏది ?
నిర్మోహత్వం ( దేనిమీద
ఎక్కువ మమకారం లేక పోవడం)
సమత వలన ఏమి కలుగుతుంది ?
తేజస్సు.
తక్కిన ఏ గుణాలు ఉండనీ, లేక పోనీ, మంచి నడవడిక మాత్రం సమస్త
జనులకూ శోభని ఇస్తుంది.
ఈ విధంగా పెద్దలు శీల
వర్తనకి పెద్ద పీట వేసారు.
ఆధారం : ఆంధ్ర
మహా భారతం. కవిత్రయ రచన.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి