29, డిసెంబర్ 2009, మంగళవారం

బాల గోపాలమ్


కొంటె కృష్ణుని చిలిపి చేష్టలు ఎంత చెప్పుకున్నా తనివి తీరదు కదా?

చూడండి ...
మాత:కిం యదునాధ: దేహి చషకం, కింతేన?పాతుంపయ:
తన్నాస్త్యద్య, కదాస్తినా? నిశి ! నిశా కావా? అంధకారోదయో
అమీల్యాక్షి యుగం నిశాప్యుపగతా దేహేతి మాతు: ముహు:
వక్షోజాం శుక కర్షణోద్యత కర: కృష్ణ :సపుష్ణాతువ:
చిన్ని గోసాలుడు యశోదమ్మని అడుగుతున్నాడు ‘‘ అమ్మా, పాత్ర యివ్వు, పాలు త్రాగుతా ’’
యశోద: ‘‘ ఇప్పుడొద్దు, రాత్రికి త్రాగుదువులే’’
గోపాలుడు: ‘‘ రాత్రి ఎప్పుడొస్తుందమ్మా?’’
తల్లి: ‘‘చీకటి పడినప్పుడు వస్తుంది నాయనా !’’
తల్లి యిలా చెప్పగానే నంద నందనుడు కనులు రెండూ మూసుకుని ‘‘ చీకటి పడి పోయిందమ్మా !’’ అంటూ తల్లి పైట లాగుతూ మారం చేస్తున్నాడుట!
అట్టి బాల గోపాలుడు మిమ్ములను కాపాడు గాక ! అని, కవి ఆశీర్వదిస్తున్నాడు.

2 కామెంట్‌లు:

తెలుగుకళ చెప్పారు...

కథ బాగుందండీ.. క్లుప్తంగా చక్కగా ఉంది. మరిన్ని కథల కోసం .. శ్లోకాల వివరణ కోసం ఎదురు చూస్తున్నాం......

చింతా రామకృష్ణారావు. చెప్పారు...

చింతా రామకృష్ణారావు. said...
అత్యద్భుత శ్లోకంబిది.
నిత్యము పఠియింపఁ దగిన నిరుపమమిది. యౌ
న్నత్యముఁ గొల్పెడు నీకును.
స్తుత్యుడ! పద్యముగ మార్చి చూపుము, ఘనమౌన్.

ఎల్లలె లేని వానికి యదెట్టులఁ గల్గును రే బవళ్ళు? యా
తల్లిని పట్టి యాడుటకు తానొనరించెడి పిల్ల చేష్టలౌన్.
చల్లని తల్లిఁ గాంచి కడు చక్కఁగ చూచెడి చూపులొప్పఁగా
నెల్లరఁ జూచి కాచుత! సమీప్సిత సత్ఫల వృద్ధిఁ గొల్పుచున్.

Tuesday, December 29, 2009

కామెంట్‌ను పోస్ట్ చేయండి